|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 04:00 PM
వంగవీటి రాధాకృష్ణకు త్వరలో నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల చంద్రబాబు పిలుపు మేరకు ఆయనను ప్రత్యేకంగా కలిసి చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రాధాకృష్ణ ఉత్సాహంగా కనిపించారని టాక్. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో ఆయన పేరు వినిపించినా, చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. కానీ ఈ సారి ఆయనకు పదవి ఖాయమైనట్లు సమాచారం.
Latest News