|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 11:09 AM
ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. గత 10 సంవత్సరాలుగా ఆధార్లో ఎలాంటి మార్పులు చేయని వారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది. జూన్ 14 వరకు ఈ అప్డేట్ను ఉచితంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ గడువు దాటితే సాధారణ రుసుము చెల్లించాల్సి రావచ్చు. గుర్తింపు పత్రాలు, చిరునామా వివరాలు సరిచేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు, సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ఆధార్ వినియోగదారులు గడువులోగా తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Latest News