|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:07 PM
AP: ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 25.30 కోట్ల పనిదినాలకు ఆమోదం లభించి, 75.43 లక్షల మంది పనులు చేసి రూ.6,277 కోట్లు లబ్ధిపొందారన్నారు. అయితే 2026లో పనిదినాలు 18.50 కోట్లకు, వెచ్చించిన మొత్తం రూ.4,951 కోట్లకు తగ్గిందని ఆయన ట్వీట్ చేశారు. గ్రామీణులకు ఆదాయం తగ్గడంతో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి క్షీణించిందని జగన్ పేర్కొన్నారు.
Latest News