|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:55 AM
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసి పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఇటీవల విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురు ప్రధాన సూత్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి నుంచి కర్ణాటకలో విక్రయించిన ఓ పసి కందును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
Latest News