|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:18 PM
బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Latest News