|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 11:40 AM
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాల నాణ్యత తనిఖీలు కలకలం సృష్టించాయి. ఫుడ్సేఫ్టీ అధికారులు సేకరించిన పాల శాంపిల్స్లో 4 చోట్ల కొవ్వు శాతం తక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 5.5% ఉండాల్సిన కొవ్వు కేవలం 3% మాత్రమే ఉన్నట్లు తేలడంతో నలుగురు పాల విక్రేతలపై అధికారులు కేసులు నమోదు చేశారు. కొవ్వు తీసేసిన పాలు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందవని, కల్తీని అరికట్టేందుకు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.
Latest News