|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 03:09 PM
AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాముల 7 బంగారు పతకాలను శుక్రవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ గీతిక సాయి, ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 చొప్పున మొత్తం రూ.20,02,232 విరాళంగా అందించారు.
Latest News