|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 03:09 PM
AP: పార్టీ నేతలు, కార్యకర్తలకు క్రమశిక్షణతో ఉండాలని CM చంద్రబాబు సూచించారు. అధికారం ఉందని అహం చూపితే పార్టీతో పాటు నేతలు నష్టపోతారని హెచ్చరించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, నేతలు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తనను బాధించాయని, అలాంటివి పునరావృతం కాకూడదని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని, ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల విషయంలో చిన్నపాటి కలహాలు కూడా రాకూడదని స్పష్టం చేశారు.
Latest News