|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 11:29 AM
ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో శుక్రవారం కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని దేవేంద్రప్ప అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం అమలు చేస్తోందని తెలిపారు.
Latest News