by Suryaa Desk | Fri, Sep 06, 2024, 07:11 PM
శ్రీ సింహ కోడూరి మరియు సత్య నటించిన "మత్తు వదలారా" సినిమా హిట్ గా నిలిచింది. హిట్ కామెడీ "మత్తు వదలారా" సీక్వెల్తో తిరిగి వచ్చింది. ఒరిజినల్ స్టార్స్ శ్రీ సింహ కోడూరి మరియు సత్య నటించిన "మత్తు వదలారా 2" ట్విస్ట్లు, నవ్వులు మరియు హై ఆక్టేన్ యాక్షన్తో నిండిన కొత్త సాహసంతో ప్రేక్షకులను తీసుకువెళుతుంది అని భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ రితేష్రా నా యొక్క సిగ్నేచర్ స్టైల్ను ప్రదర్శిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ని డ్రామా నక్కో మమ్మ అనే టైటిల్ తో ఈరోజు రాత్రి గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ ఇండియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సాంగ్ కి కల భైరవ కంపోస్ చేయగా, ఫరియా అబ్దుల్లా లిరిక్స్ అందించి తన గాత్రాన్ని అందించారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
Latest News