ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మై ఎక్స్ యానివర్సరీ'.. స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:13 PM

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తనకంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్ వేదికగా.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వృత్తిపరమైనవే కాకుండా తన అభిప్రాయాలు, వ్యకిగత అభిరుచులు, జీవన శైలి గురించిన విశేషాలు, తన అనుభవంతో యువతకు కొన్ని మంచి సూచనలు చేస్తూ ఉంటారు. స్మితా సబర్వాల్ ఏ పోస్టు పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.


  తాజాగా.. ట్విట్టర్ వేదిగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ఖాతా యానివర్సరీ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మై ఎక్స్ యానివర్సరీ.. నాలుగేళ్లుగా నన్ను ఫాలో అవుతున్న వారందరికి ధన్యవాదాలు. ప్రేమ, అభిమానంతో నాకు మద్దతుగా నిలుస్తున్న వారందిరకీ ధన్యవాదాలు.' అని ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు విషెస్ చెబుతుండగా.. మరికొందరు ఆమె చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి వాట్ ఏ ట్యాగ్‌లైన్ అని పొగుడుతున్నారు. చాలా తెలివిగా మరో అర్థం వచ్చేలా స్మితా ట్వీట్ చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు రాసుకొస్తున్నారు.


2001 బ్యాచ్‌కు చెందిన స్మితా సబర్వాల్‌కు డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలక పోస్టుల్లో కొనసాగారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమె ట్రాన్స్‌ఫర్ చేసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa