ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రసక్తే లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 02:49 PM

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అండగా నిలుస్తామని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నుండి పలువురు నేతలు బీజేపీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. నమ్మకంతో వచ్చిన ప్రతి బీజేపీ సైనికునికి అండగా ఉంటామని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ ను అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa