ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రజలకు తీపికబురు.. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు.. ముహూర్తం ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 09:30 PM

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు మరో గుడ్ న్యూస్ వినిపించింది. అంసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండగా.. ఇప్పుడు అడ్డంకులన్ని తొలిగిపోవటంతో ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై కూడా మరో రెండు మూడు రోజుల్లోనే తీపి కబురు వినిపించింది. ఈ మేరకు.. ఖమ్మం జిల్లా తిరుమాయపాలెంలో నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.


మరో రెండు మూడు రోజుల్లో కేబినెట్ భేటీ జరగబోతోందని.. అందులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురు వినిపించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటాని తెలిపారు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించిన నిర్ణయాన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో తీసుకోనుండగా.. ఇప్పుడు ఈ కీలక హామీలను కూడా అమలు చేస్తామని మంత్రి తెలపటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. కేబినెట్ భేటీ ఎప్పుడు జరుగుతుందో అదే రోజు ఆ హామీల అమలుకు ముహూర్తం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే.. వాటన్నింటినీ ఆపేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆసరా పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 గా ఇవ్వగా.. కాంగ్రెస్ సర్కారులో మాత్రం ఆసరా పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛన్ రూ.6,000 చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.


రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని భూమి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల కష్ట పలితంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. మూడేళ్లలో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. వర్షాకాలం సాగుకు చివరి ఎకరం వరకు నీళ్లు వచ్చే విధంగా అధికారులు చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa