ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2024, 05:29 PM

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. రేపు జూన్ 17న నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముస్లింల ముఖ్య పండుగల్లో ఒకటైన బక్రీద్‌ సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రార్థనల కోసం ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చే మాసబ్‌ ట్యాంక్‌ సమీపంలోని మీరాలం దర్గా, హాకీ గ్రౌండ్‌, లంగర్‌హౌజ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.


రేపు ఉదయం 8:00 నుంచి 11:30గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌, మీరాలం దర్గా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌ మళ్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతిస్తామని.. మిగతా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఇక ప్రార్థనల కోసం వచ్చే వారి కోసం ఈద్గాల సమీపంలో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడ మాత్రమే తమ వాహనాలు పార్క్‌ చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa