ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్దపు మాటలతో, అసత్య ప్రచారపు పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 03:24 PM

ఈరోజు గండిమైసమ్మ చౌరస్తా లోని భౌరంపేట్ సహకార సంఘం బ్యాంక్ ముందు రైతు రుణమాఫీ పై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భౌరంపేట్, దుందిగల్ కి చెందిన రైతులు తమ నిరసన తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం డిసెంబర్ 9 లోపు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలరుణమాఫి చేశామని చెబుతూ రైతాంగాన్ని నట్టేటా ముంచిందని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఎద్దేవా చేశారు. బౌరంపేట్,దుండిగల్  .ఈ బ్యాంక్ లో 632మంది రైతులు రుణం పొందితే కేవలం 14మంది రైతులకు 4.30లక్షలు మాత్రమే బుణమాఫీ అయ్యిందని మిగతా 618మంది రైతులకు 2.95కోట్ల రుణాలను మాఫీచేయాలని లేని యేడల మోసపూరిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి గద్దెదిగాలని ఎమ్మెల్యే అన్నారు. రైతుభరోసా రాష్ట్ర వ్యాప్తంగా పత్తాకులేదన్నారు. రుణమాపి డిసెంబర్ 9 నుండి ఆగస్ట్ 15లోగా తెలంగాణ రైతులందరికి 2లక్షల రుణమాపి చేస్తానని మాయమాటలు చెప్పిన రేవంత్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబందించి నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 5శా తం మంది రైతులకు మాత్రమే రుణమాపి చేసిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa