ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాటల రచయిత కు సన్మానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 04:59 PM

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్  దేవరకొండ నియోజకవర్గ కార్యాలయం లో  ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళితరత్న డా" బుర్రి వెంకన్న,నల్లగొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు భిక్షపతి,డివిజన్ నాయకులు   చెపూరి రాజేష్,లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ నక్క వెంకటేష్ లు పాటల రచయిత, కవి  రగుడంపల్లి వెంకటయ్య ను  ఘనంగా  సన్మానించారు.వెంకటయ్య వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డుగా ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.ఒక ప్రక్క విధులు నిర్వహిస్తూనే తనకు పాటల మీద ఉన్న మక్కువతో రచనలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు అన్నారు. వెంకటయ్య స్వగ్రామం డిండి మండలం లోని గోనబోయినపల్లి గ్రామం నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఓర్చుకొని చదువుకున్నాడు తన విద్యకు తగిన సార్థకత లాభించాలనే ఉద్దేశ్యంతో తనదైన శైలిలో పాటలు వ్రాయడం సంతోషంగా ఉందని ముందు ముందు మరిన్ని మంచి పాటలు వ్రాసి ఎన్నో సన్మానాలు అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నట్లు  వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలోనే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళితరత్న డా" బుర్రి వెంకన్న గారు గౌరవ డాక్టరెట్ అందుకున్న విషయం విదితమే ఆయన మాట్లాడుతూ దళితజాతి నుండి యువకులు తన స్వంత ప్రతిభ ను కనబరుస్తూ మహనీయుల అడుగుజాడలో ప్రయణిస్తూ  చైతన్యవంతులై సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారని వెంకటయ్య లాంటి వ్యక్తి నేటి యువతకు ఆదర్శం అని ఆయన అన్నారు .రాబోవు కాలంలో రాష్ట్రస్థాయిలో వెంకటయ్యకు గుర్తింపు వచ్చే విధంగా సంఘం ద్వారా కృషి చేస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సన్మాన గ్రహీత రగుడంపల్లి వెంకటయ్య  కృతజ్ఞతలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa