ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం : బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 03:17 PM

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన చెప్పారు.టెండరింగ్ ప్రక్రియే తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు. లడ్డూ తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయం భయంకరమైందిగా చెప్పారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa