ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 10:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పరామర్శ, ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఇలా మంగళవారం నాడు ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు.జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రేపు ఉదయం ఆయనను ముఖ్యమంత్రి పరామర్శిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిర్వాసితులూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అన్ని వివరాలను అధిష్ఠానానికి వివరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa