యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల కుమారుడికి ఉరేసిన తల్లి.. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. భూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జడల రాజు అదే గ్రామానికి చెందిన జడల సోనిని 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. రాజు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో డెకరేషన్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం (అక్టోబర్ 7) సాయంత్రం రాజు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. రాజు తల్లిదండ్రులు చిన్నరావులపల్లి శుభకార్యం ఉండటంతో బంధువుల ఇంటికి వెళ్లారు.
ఇంట్లో సోని, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. బయట ఆడుకుంటున్న పెద్ద కుమారుడు చింటూ (7), చిన్న కుమారుడు రేయాన్ష్ (5)ను ఇంట్లోకి రమ్మని తల్లి సోని పిలిచింది. అయితే ఆటలో మునిగిపోయిన చింటూ ఇంట్లోకి వెళ్లేలేదు. చిన్న కుమారుడు రేయాన్ష్ మాత్రం తల్లి పిలవగానే ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం చిన్నారిని బెడ్రూంలోకి తీసుకెళ్లిన సోని లోపల్నుంచి గడియ పెట్టుకుంది. మొదట కుమారుడు రేయాన్ష్ను ఊపిరాడకుండా ఉరేసి చేసి చంపేసింది. అనంతరం తాను కూడా చున్నీతో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. సాయంత్రం 7 తర్వాత పని ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త రాజు తలుపులు గట్టిగా బాదినా ఆమె తీయలేదు.
దీంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. తల్లీ కుమారుడు విగతజీవులుగా కనిపించారు. షాక్కు గురైన రాజు.. గట్టిగా అరుపులు కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయి అచేతనంగా పడిపోయి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని గ్రామస్థులు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె మానసిక వేదనకు గురవుతోందని చెప్పారు. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో సైతం చూపిస్తున్నారని తెలిపారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa