పరవళ్లు తొక్కే కృష్ణమ్మపై పడవలో ప్రయాణం ఆ అనుభూతే ఎంతో థ్రిల్లింగ్ ఉంటుంది. పర్యాటకులకు సరికొత్త అనుభూతి మళ్లీ అందుబాటులోకి రానుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం నవంబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ ఫ్లీటు జనరల్ మేనేజర్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 2 నుంచి ప్రతి శనివారం సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ రాకపోకలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఛార్జీలు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ల వివరాలు తెలియజేశారు.
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. రెండు వైపులా అయితే పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 టికెట్ ధర నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఆసక్తి ఉన్నవారు 7997951023 (సాగర్), 9848540371, 9848125720 (సీఆర్వో హైదరాబాద్) నంబర్లలో సంప్రదించాలని ఆయన చెప్పారు. సాగర్ నుంచి శ్రీశైలానికి లాంఛీలో ప్రయాణం కొత్త అనుభూతి నింపుతుంది. ఓవైపు నల్లమల్ల ఒకవైపు బిరా బిరా కృష్ణమ్మ పరుగులు… మరోవైపు దట్టమైన అడవితల్లి అందాలు.. పచ్చని కొండల మధ్యగా సాగే ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది ఈ ప్రయాణం. ఈ అనుభూతి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుంది. పర్యాటకులు. నాగార్జునసాగర్ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం దాదాపు ఏడు గంటల పాటు సాగుతోంది. ఈ జర్నీ ఆద్యంతం పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆసక్తి సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్గా ఉంటుంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉంది. దీంతో నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది.
మరోవైపు, ఎగువ కురుస్తోన్న వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సాధారణంగా అక్టోబరు ప్రారంభం తర్వాత కృష్ణానదిలో వరద తగ్గిపోతుంది. కానీ, ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అక్టోబరు చివరి వారంలోనూ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ముఖ్యంగా ఉపనది తుంగభద్ర గతవారం రోజుల నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలానికి 65 వేలకు క్కూసెక్కులకుపైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa