ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిడ్నీ, ఆస్ట్రేలియా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్పీకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 05:35 PM

67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సి పి ఏ కాన్ఫరెన్స్ జరిగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ICC), సిడ్నీ కు చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తెలంగాణ లేజిస్లేచర్ బృందం.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు మరియు లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు గారు ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేశారు.
కాన్ఫరెన్స్ కు సంబంధించిన మెటిరియల్ ను,  సమాచారాన్ని సి పి ఏ ప్రతినిధులు తెలంగాణ బృందానికి అందజేశారు. ఈసందర్భంగా శాసనసభ, శాసనమండలి పనితీరు, నిర్వాహణలపై తెలంగాణ బృందం సి పి ఏ ప్రతినిధుల మద్య చర్చ జరిగింది. నవంబర్ 5,6,7 తేదీలలో 67వ CPA కాన్ఫరెన్స్ ప్రధాన వేదిక అయిన ICC సిడ్నీలో జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa