ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2024, 04:42 PM

హబూబాబాద్ జిల్లా, డీఎస్సీ 2024 ద్వారా ఎంపిక కాబడి గూడూరు మండలానికి కేటాయించబడినటువంటి నూతన ఉపాధ్యాయులు, ఎస్ టి ఓ. మహమ్మద్ రఫీ ని కలిసి, నూతన ఉపాధ్యాయులకు ఎంప్లాయ్ ఐడి నెంబర్లు త్వరితగతిన ఇప్పించినందుకుగాను, ధన్యవాదములు తెలియజేశారు. అదేవిధంగా ఎస్ టి ఓ. మహబూబాబాద్ జిల్లా గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఎన్నికైనందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్ టి ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. నూతనంగా విధుల్లోకి వచ్చిన ఉపాధ్యాయులు శ్రద్ధతో విధులు నిర్వహించాలని, మా శాఖ తరపున అందించవలసినటువంటి సహాయ సహకారాలను సకాలంలో అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, చింత అర్జున్ రావు, జే. రేణుక, కుమార్, నాగరాజు, మధు, రమేష్, సుమలత, యాదలక్ష్మి , హరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa