ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు లోవోల్టేజి సమస్య రాకుండా కెపాసిటర్లు బిగించుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 04:40 PM

రైతులు లోవోల్టేజి సమస్య రాకుండా కెపాసిటర్లు బిగించుకోవాలని టిజిఎన్ఏ పిడిసిఎల్ గోల్లపల్లి ఎ.డి.ఇ వరున్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా గోల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎ.డి.ఇ వరున్ కుమార్ మాట్లాడుతూ రైతులు వారి పొలాల వద్ద స్టారర్లు,ఫ్యూజులు,స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు.
మోటర్ లకు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు.విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సమాచారం అందించాలని సూచించారు.పొలాల చుట్టు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని,తద్వారా రైతులు,పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చిల్వాకోడూరు ఎ.ఇ. అనిల్ కుమార్,చిల్వాకోడూరు సెక్షన్ విద్యుత్ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa