ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్, హరీశ్రావు నివాళులర్పించారు. తెలంగాణ సమాజం కోసం కాళోజీ పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నివాళులర్పించారు.ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ అని కేటీఆర్ అన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు మన కాళన్న అని కేటీఆర్ అన్నారు . కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు.తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ గారు తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని గుర్తుచేశారు.. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారని అన్నారు. వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని చెప్పారు.స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు.“అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు” అంటూ సగర్వంగా చాటిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావును హరీశ్రావు కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa