ట్రెండింగ్
Epaper    English    தமிழ்

*కంటి శస్త్ర చికిత్సలను వినియోగించుకోవాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 03:01 PM

జిల్లా ఆస్పత్రిలో 15  లక్షల రూపాయలతో కంటి ఆపరేషన్ థియేటర్  ఏర్పాటు చేశామని, ఈ రోజు కంటి శస్త్ర చికిత్సలను ప్రారంభించామని,ఈ సదుపాయాన్ని పేషంట్స్ జిల్లా ప్రజలు వాడుకోవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభమైందని, మొదటిరోజు విజయవంతంగా 4 కంటి శస్త్ర చికిత్సలు ఆప్తామాలజిస్ట్ వైద్యులు డాక్టర్ సబీహా మరియు డాక్టర్ సింధూర నిర్వహించారని అన్నారు.
కంటి శస్త్ర చికిత్స అవసరమైన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని, నైపుణ్యం అనుభవం కలిగిన వైద్యులు, అవసరమైన పరికరాలు  అందుబాటులో ఉన్నాయని, వీటిని అవసరం ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని  కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa