ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ఎన్నికల ఫలితంలో భాగంగా, బాణసంచ పేల్చిన మండల బిజెపి పార్టీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 12:09 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు లో, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఫలితం లో భాగంగా, గూడూరు మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు గుండెబోయిన మలేష్ యాదవ్ ఆధ్వర్యంలో, బాణాసంచా పేల్చి, స్వీట్లను పంచి, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. సదానంతరం బిజెపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని, ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి ప్రజలు అందరూ పట్టం కడుతున్నారని అన్నారు, నరేంద్ర మోడీ అభివృద్ధికి ప్రజలలో విశ్వాసం పెరిగి, బిజెపిని గెలిపిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా దీనమైన పరిస్థితిలో  ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు తీసుకెళ్లి కుమ్మరించిన, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి  అధికార కాంగ్రెస్ పార్టీని, దేశంలోనూ  కాంగ్రెస్ పార్టీని  ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మహారాష్ట్రలో ఘనవిజయం అందించిన ప్రజలందరికీ మండల పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు ఈ కార్యక్రమంలో  మేరెడ్డి సురేందర్, చెల్పూరి శ్రీశైలం, సమ్మెట సుధాకర్ గౌడ్, రాసమల్ల వెంకన్న, పడాల నాగరాజు, బత్తుల లక్ష్మణ్, చిలుకూరి రాజు, నల్లగొండ అనిల్, వెలగం రవి, కోరే అనిల్, బల్సుకూరి సంపత్, పాపని శ్రీనివాస్, చెంచు  నాగేష్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa