ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 01:32 PM

ఏబీవీపీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ ఐ ఎంతోమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు వారు మృత్యుని జయించి బతికారు ఒక సంఘటన జరిగి మరవకముందే ఇంకో సంఘటన జరుగుతుంది.
మద్యానికి మంత్రి ఉండగానే విద్యకు మంత్రి లేడు ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం అసలు పట్టించుకోవడం లేదు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారు ఎక్కడైనా ఏమైనా సంఘటన అధికారులు అస్సలు స్పందించడం లేదు అంటే ప్రాణాలు కోల్పోతేనే వీరు స్పందిస్తారా ఇప్పటికే 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీస సోయ లేకుండా ఎక్కడ పడ్డా గొంగడి అక్కడే ఉన్నట్లు వారి వ్యవహార శైలి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, జోనల్ ఇంచార్జ్ దినేష్, నాయకులు ముమ్మడి అరవింద్, శివకుమార్, మణికంఠ, ఉదయ్ కిరణ్, శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa