ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 05:39 PM

ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.28 లక్షల 61వేల 7వందల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గం చేవెళ్లనేనని అన్నారు. సీఎం సహాయ నిధి కోసం అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, దళారులను ఆశ్రయించవద్దని, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వవద్దని, నేరుగా క్యాంపు కార్యాలయంకు వచ్చి అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసుదాన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోనే ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, చేవెళ్ల, నవాబు పేట్ మార్కెట్ కమిటీ చైర్మన్లు పెంటయ్య గౌడ్, రాథోడ్ గీతాసింగ్ నాయక్, వైస్ చైర్మన్ బేగరి రాములు, కాంగ్రెస్ చేవెళ్ల మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, నాయకులు పడాల రాములు, పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa