క్రిమినల్ కేసులకు సంబంధించి గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించి శిక్షలు, జరిమానాలు విధించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని జోగిపేట సీఐ అనిల్కుమార్ హెచ్చరించారు. గురువారం జోగిపేట సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందోలు మండలం చింతకుంట గ్రామంలో ఈనెల 25వ తేదిన దొంగతనానికి గురైన టాటా ఏసీ ఆటో కేసుకు సంబంధించి గ్రామంలో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి రూ.5 లక్షల జరిమానా విధించడం వల్లనే భయం, పరువుతో మంజీర నదిలో తల్లి బాలమణితో కలిసి వడ్ల శ్యాంకుమార్ ఆత్మహత్య చేసుకున్నారని సీఐ తెలిపారు. ఆటో యజమాని సంగారెడ్డికి చెందిన సలీం తరపున కొందరు పెద్దలు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దొంగిలించబడిన ఆటో బుజరంపేటలోని ఒక గుంతలో ఇరుక్కుపోవడంతో నంబరు ఆధారంగా ఆటోను గుర్తించి సలీంకు బుజరంపేట గ్రామానికి చెందిన వారు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ విషయంలో చింతకుంట గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్కుమార్ అనే యువకుడు ఆటో దొంగతనం చేసినట్లుగా నిర్దారించి 26న ఉదయం శ్యామ్ కుటుంబికులను పిలిపించి పంచాయితీ నిర్వహించారు. ఆటోను ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లినందుకుగాను రూ.5 లక్షల జరిమాన కట్టాలంటూ శ్యామ్ కుటుంబికులపై స్థానిక పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దీంతో పంచాయితీ నిర్వహించడంపై తమ పరువు పోయిందని భావించి మనస్థాపానికి గురైన శ్యామ్ తన తల్లి బాలమణి మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబందించి మృతురాలి భర్త యాదయ్య పిర్యాదు మేరకు మౌలాన, చాంద్పాషా, మహబుబ్అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, ఆంజనేయులపైన కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa