ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ అందించే ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ఏపీ సీఎం చంద్రబాబుకు లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.చంద్రబాబును ఒక దార్శనిక నేతగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పాలనలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ, కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa