ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ ఏడాది పాలనలో అద్భుత విజయాలు సాధించాం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 02:11 PM

డిసెంబర్ 4 వ తేది బుధవారం రోజున యువశక్తి యువవికాస విజయోత్సవ సభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన పత్రిక మీడియా సమావేశంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు  , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మక్కాక్ సింగ్ రాజు ఠాకూర్  పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బుధవారం పెద్దపల్లిలో యువ వికాస విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు బహిరంగ సభలో పాల్గొననున్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. ప్రాజెక్టు సర్వే కోసం నిధులు కేటాయింపు చేస్తారని వివరించారు. పెద్దపల్లి ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు ప్రకటన కూడా చేయనున్నారని తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, జిల్లా కేంద్రంలో రూ. 5కోట్లతో స్వశక్తి మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులకు, మంథనిలో ఆర్‌అండ్‌బీ పెండింగ్‌ రోడ్ల పూర్తికి శంకుస్థాపనలు చేస్తారన్నారు. రూ. 10 కోట్లతో అంతర్గాంలో, మంథని గంగపురిలో, పోతారం గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టషన్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో బండ్లవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, రామగుండం మున్సిపాలిటీల పరిధిలో రూ. 51 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద మానేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ. 80 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారని, కాల్వశ్రీరాంపూర్‌ నుంచి మొట్లపల్లి రూ. 25కోట్లతో, పీడబ్ల్యు రోడ్‌ నుంచి ఎల్లంపల్లి వరకు రూ. 7 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. రూ. 6కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు వరకు రహదారి విస్తరణ, రూ. 5కోట్లతో హుస్సేన్‌ మియా వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి, రూ. 12 కోట్లతో సుగ్లాంపల్లి నుంచి ధూళికట్ట వరకు రహదారి విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చెస్తారని మంత్రి తెలిపారు. రామగుండంలో రూ. 60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, మంథనిలో బ్రిడ్జి, రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి పేర్కొన్నారు. మంథని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ పనులకు శంకుస్థాపన చేస్తారని, గుంజపడుగులో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం, పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రిని 150 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లతోపాటు ఎలిగేడులో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు పై ప్రకటన చేస్తారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి అన్ని హంగులతో పనులు నిర్వహించేలా శంకుస్థాపన చేయడంతోపాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. రూ. 23వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
జిల్లాలో 60,619 రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. సీఎం సభలో 500 మందికి సింగరేణి ఉద్యోగాల నియామకాలు, గ్రూప్‌- 4, ఇతర ఉద్యోగాలు దాదాపు 8500 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, కార్పోరెషన్ల చైర్మన్లు జనక్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్‌రావు, నాయకులు ఊట్ల వరప్రసాద్‌, బుషనవేని సురేశ్‌ గౌడ్‌, బండారి రామ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, మస్రత్‌, సర్వర్‌ పాషా, ముడుసు సాంబరెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, భూతగడ్డ సంపత్‌ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa