మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యావ్యవస్థలో సంస్కరణలను తీసుకురావడానికి, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, మంగళవారం గూడూరు మండలంలో జ్యోతిబాపూలే బాలికల గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం, ఎస్సీ బాలికల హాస్టల్ లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పాఠశాలల్లోని ప్రతి అంశాన్ని పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్ లు, రికార్డులు, వంటగది, డైనింగ్ హాల్. బాత్రూమ్స్, డార్మిటరీ రూమ్స్, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. పిల్లల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అన్ని రకాల ప్రమాణాలను పాటించాలని ఎక్స్పైరీ డేట్ ను పరిశీలించి మాత్రమే వంట సామానులను స్వీకరించాలని సూచించారు.
పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం అయి వారి అభ్యసనా, సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని నాణ్యమైన విద్యను అందించడంలో, అధికారులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వీరి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవీందర్ రెడ్డి పరిశీలనలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక తహసీల్దార్ సంగు శ్వేతా, ఎంపీడీవో ఎర్ర వీరస్వామి, బీసీ ఎస్సీ సంక్షేమ అధికారి నరసింహ స్వామి, ఎస్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సైదానాయక్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస రావు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రజనీ దేవి, కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీత, జ్యోతిబా పూలే గురుకులం ప్రిన్సిపల్ రాధిక, ఏ ఎం ఓ. చంద్రశేఖర్ అజాద్, మండల విద్యాశాఖ అధికారి జంజిరాల రవికుమార్, జి సి డి ఓ. విజయ కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుండెబోయిన మల్లయ్య, సీఆర్పీలు రవికుమార్, శోభన్ రెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి రమేష్ నాయక్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa