ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. ఎంత పెరగొచ్చంటే

business |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 11:12 PM

ఈ ఏడాది చివర్లో 7వ వేతన సంఘం గడువు ముగియనుంది. ప్రతి పదేళ్లకు ఓసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో 2026లో 8వ వేతన సంఘం ఏర్పాటు కావాలి. కానీ ఇది కాస్తా ఆలస్యం అవుతోంది. ఎప్పుడో జనవరి నెలలోనే వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ.. విధివిధానాల ఆమోదానికి మరో 10 నెలల సమయం పట్టింది. ఇటీవలే నవంబర్ నెలలో 8వ వేతన కమిషన్ విధివిధానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక్కడ సిఫార్సుల కోసం 18 నెలల సమయం ఇచ్చింది. అంటే ఆ తర్వాతే 8వ వేతన సంఘం అమలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో దాదాపు మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.


>> వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చినా.. ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షనర్లకు పింఛన్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఆలస్యం కావడం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఒకవైపు ఆందోళనగా ఉన్నప్పటికీ.. మరోవైపు జీతాలు భారీగా పెరుగుతాయని సంతోషంలో ఉన్నారు. ఇక్కడ వేతన కమిషన్ సిఫార్సుల్ని బట్టే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, డీఏ, పెన్షన్ వంటివి ఖరారవుతాయి. ఇక్కడ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇదే ఎంత మేర పెరుగుతుందనేది నిర్ణయిస్తుంది.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే.. జీతం ఎక్కువగా పెరుగుతుంది. తక్కువగా ఉంటే.. జీతం తక్కువగా పెరుగుతుందని చెప్పొచ్చు. చాలా వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 కుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 2.15 గా ఉంటే.. అప్పుడు ఉద్యోగుల జీతభత్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఇది ఆలస్యంగా అమల్లోకి వచ్చినా.. అరియర్స్ ఉంటాయి.


>> ఉద్యోగి బేసిక్ పే రూ. 18 వేలుగా ఉందనుకుందాం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15 గా అనుకుంటే కొత్త బేసిక్ పే రూ. 18000x2.15= రూ. 38,500 అవుతుంది. అంటే ఇక్కడ రెట్టింపునకు మించి అయిందని చెప్పొచ్చు. ఇలాగే రూ. 50 వేల బేసిక్ పై కొత్త బేసిక్ పే రూ. 1,07,000 అవుతుంది.


మరిన్ని ఉదాహరణలు చూస్తే.. ప్రస్తుత లెవెల్-1 ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే రూ. 18 వేల నుంచి రూ. 38,700 కు పెరుగుతుంది. లెవెల్-2 ఉద్యోగి బేసిక్ పే ఇప్పుడు రూ. 19,900 గా ఉండగా.. 2.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లెక్కన ఇప్పుడు రూ. 42,785 కు చేరుతుంది. లెవెల్-3 కింద రూ. 21,700 నుంచి రూ. 46,655 కు చేరుతుంది. లెవెల్-4 ఉద్యోగి కనీస వేతనం ఇప్పుడు రూ. 25,500 కాగా.. తర్వాత రూ. 54,825 కు చేరుతుంది. లెవెల్-5 కింద ఇప్పుడు రూ. 29,200 గా బేసిక్ పే ఉండగా.. తర్వాత రూ. 62,780 గా అవుతుంది. ఇలానే అన్నింటికీ వర్తిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa