ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాజీపల్లి అటవిని సందర్శించిన విద్యార్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2024, 03:35 PM

ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని చెట్లపోతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సందర్శించారు.  ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా విద్యార్థులు అటవీ సందర్శనకు వెళ్లారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ అనే అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ పోటీలలో 64 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అటవీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ షాహీన్ తరణం మాట్లాడుతూ... జీవావరణ వ్యవస్థలలో సమతుల్యత ఉన్నప్పుడే జీవుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయ్ కుమార్  మాట్లాడుతూ...సృష్టిలో ప్రతి జీవికీ ప్రత్యేక స్థానం ఉందన్నారు. పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచడం, అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే చెట్ల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు షాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు సుభాస్కర్, కాశీనాథ్, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa