ఖమ్మం నగర పరిధిలో కార్పోరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పోరేషన్ లో విలీనమైన పంచాయతీలలో కార్మికుల కొరత, త్రాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లు లేవని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, మొదటి ప్రాధాన్యతగా పనిముట్లు, ఫాగింగ్ యంత్రాలు కొత్తవి కొనుగోలు చేసి సంబంధిత విలీన ప్రాంతాలకు సరఫరా చేయాలని మంత్రి అన్నారు.
ప్రతి డివిజన్ కు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లు తయారు చేసి సంబంధిత డివిజన్ ఇంజనీర్ అధికారులు, డివిజన్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలు ఉండేలా చూడాలని అన్నారు. పారిశుధ్య సిబ్బంది కొరత ఉందని, అటెండెన్స్ తప్పుగా నమోదు అవుతుందని, నీటి లీకేజీ సమస్యలు వేగంగా పరిష్కారం కావడం లేదని మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa