మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల గొల్లగూడానికి చెందిన, అంగవైకల్యాన్ని అధిగమించి అనుకున్నది సాధించిన, అంతర్జాతీయ పారా త్రో బాల్ లో మెరిసిన, గూడూరు మండల బిడ్డ దయ్యాల భాగ్య నాడు చేజారిన, నేడు దరిచేరిన అవకాశం తో స్వర్ణ పథకం సాధించి, గూడూరు మండలానికి చేరడంతో, గూడూరు మండలం టిఆర్ఎస్ మండల కమిటీ దయ్యాల భాగ్యను శాలువాతో సత్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో గూడూరు మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, సీనియర్ నాయకులు కటార్సింగ్, టౌన్ అధ్యక్షులు చీదురు వెంకన్న, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి. రహీం పాషా, మాజీ టౌన్ అధ్యక్షులు ఎదునూరి వెంకన్న, సొసైటీ డైరెక్టర్ ఎడ్ల రమేష్, మండల ఉపసర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షులు వల్లపు నాగరాజు, టౌన్ ప్రధాన కార్యదర్శి తండా శ్రీహరి గౌడ్, రైతు సమన్వయ సమితి సంపంగి రామన్న, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం రమేష్, టౌన్ ఉపాధ్యక్షులు బొంత రామన్న, టౌన్ సహాయ కార్యదర్శి మండల కుమార్, తంగళ్ళపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa