ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 03:56 PM

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తొగుట సిఐ లతీఫ్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలు, రాయపోల్ మండలం అనాజిపూర్ పెద్దమ్మ దేవాలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం లో అన్ని దేవాలయాలు, చౌరస్తాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోని మా పోలీస్ సిబ్బందికి సహకరించగలరని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం తొందరగా ఉంటుందన్నారు.
ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ వంటి నియంత్రణపై ఉక్కు పాదం మోపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు ఉన్న ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉండాలని, రోడ్డు నిబంధనలు అతికమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ గౌడ కులస్తులు నాగరాజు గౌడ్,  రామకృష్ణ గౌడ్, పులిగారి స్వామి గౌడ్, లోతుమడ్ల విఠల్ గౌడ్, బిక్షపతి గౌడ్, బాలా గౌడ్, ప్రశాంత్ గౌడ్, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు....






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa