వికారాబాద్ జిల్లా కల్లెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్సు హాలు నుండి కమిషనర్ లు, ఏం పి డి ఓ లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తవు ఇవ్వకుండా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలనీ, ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు.సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇప్పటివరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి, వారికి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే, అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపర్చాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా లబ్ది చేకూరేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డి ఆర్ డి ఎ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa