ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్సై కి వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 04:24 PM

మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా, డిపో సర్కిల్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్సై కిరణ్ కుమార్ కు యువజన సంఘాల సభ్యులు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్  పునరుద్ధరించేంత వరకు సర్కిల్ ల వద్ద కానిస్టేబుళ్లను నియమించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని ఎస్సైని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నాయకులు దోమకొండ రమేష్, ఆర్మూర్ రంజిత్, జెట్టి నరేందర్, రాజు, సునీల్, పురుషోత్తం లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa