ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల అతీతంగా అభివృద్ధి పథకాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 03:40 PM

బంట్వారంలోని సుధాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 71 మంది లబ్ధిదారులకు 71,08,236 రూపాయల విలువ గల చెక్కులను స్పీకర్ పంపిణీ చేశారు.   స్పీకర్ పర్యటనలో భాగంగా బంట్వారం మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 40 లక్షలతో చేపట్టే  సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ రొంపల్లి 30  లక్షలు, తురుమామిడి 40 లక్షలతో  చేపట్టే సిసి రోడ్లకు శంకుస్థాపన, ఎన్ఈఆర్జిఎస్ డిఎంఎఫ్టీ 35 లక్షల నిధులతో బోప్నారం సిసి రోడ్డు పనులకు స్పీకర్ శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా సల్ బత్తాపూర్ లో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు కు స్పీకర్ ప్రారంభోత్సవం గావించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో స్పీకర్ మాట్లాడుతూ.పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని  శాసనసభ సభాపతి  హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధితో ప్రజలకు సేవ చేయడమే  ధ్యేయమని స్పీకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు స్పీకర్ తెలిపారు. ఈకార్యక్రమాల్లో పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, తహసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో రాములు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa