రేపు హైదరాబాద్లో కక్కాముక్కా దొరకదు. రేపు (జనవరి 30న).. హైదరాబాద్లో మాంసం దుకాణాలేవి తెరుచుకోవు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరి రేపు ఎందుకు మాంసం దుకాణాలు మూసేయాలనేగా మీ డౌటనుమానం. రేపు అంటే జనవరి 30వ తేదీ మన భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. కాగా.. రేపు గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం రోజున హైదరాబాద్ నగరవ్యాప్తంగా.. మాంసం దుకాణాలు మూసేయాలని.. మాంసం విక్రయాలు నిషేదిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మాంసం దుకాణాలతో పాటు.. అన్ని మేక, గొర్రెల మండిలు కూడా మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హెచ్చరించారు. ఈ విషయంపై పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. మాంసం దుకాణాలు తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని కోరారు. హింసాత్మక చర్యలు చేపట్టొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అయితే.. ఈ నింబంధనలు కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా గాంధీ జయంతి (అక్టోబర్ 02న) రోజున మాత్రమే మాంసం అమ్మకాలు, మద్యం విక్రయాలు నిషేధం అనే ఆంక్షలు ఉంటాయని అందరికీ తెలుసు. ఎందుకంటే.. గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించే వారని.. జీవహింస చేయకూడదని.. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని బోధించిన మహాత్ముడు.. చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండి సన్మార్గంలో జీవితాన్ని సాగించాలని జాతికి సందేశం ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆయన జయంతి రోజు మాంసం అమ్మకాలు, మధ్యపానం నిషేధం. అయితే.. జయంతి రోజే కాకుండా.. ఆయన వర్ధంతి రోజు కూడా అహింసా మార్గాన్ని పాటించాలన్న ఉద్దేశంతో అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. మరి ఎంత మంది పాటిస్తారన్నది చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa