ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొసైటీ సభ్యత్వాలు లేక పథకాల లబ్ధి కోల్పోతున్న మత్స్యకారులు : నీలం మధు ముదిరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 02:58 PM

పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కోరారు.గురువారం ఇస్నాపూర్ మత్స్యకార సోదరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి మత్స్యకారుల సమస్య పై వినతి పత్రం అందించారు. అనంతరం ఈనెల 8వ తేదీన జిన్నారం మండలం కోడకంచి ఆదినారాయణ స్వామి జాతర మరియు ఈనెల 21వ తేదీన ఇస్నాపూర్ పెద్దమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు. దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని మరియు పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa