టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ద సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సమగ్ర కుల గణన సర్వే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ బీసీ నాయకులు, పట్టణ ఎస్సీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ, చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలొ ఇచ్చిన మాట ప్రకారం నేడు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం జరిగిందన్నారు. ఈ రెండు బిల్లులు ఆమోదించడం భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక కాంగ్రెస్ పార్టీ విజయంగా పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని బీసీ ఎస్సీ రిజర్వేషన్లు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం అనేది గొప్ప విషయమని కొనియాడారు. విష్పక్షపాతంగా రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆయా వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోనే కాకుండా చట్టసభల్లో రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలను, ఎస్సీలను ఉన్నతమైన స్థానానికి తీసుకురావడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. బీసీ లకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అంటూ, విపక్షాలు ఈ రాజకీయ రిజర్వేషన్ లు మీరు కూడా అమలు చేస్తారా..? చేసే దమ్ము మీకు ఉందా అని ప్రశ్నించారు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణలోని ప్రతి ఒక్క బీద కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగే అవకాశమని, అలాంటి అతి ముఖ్యమైన బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా తెలంగాణ ప్రజలు ఎంతో మేలు పొందుతారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ కులాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని, అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, రాంచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, శ్రీనివాస్ ముదిరాజ్, మురళి, రెడ్యానాయక్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జంగయ్య, వెంకట్ రెడ్డి, సర్ఫరాజ్, పర్షురామ్, నరేంద్ర, రమేష్ నాయక్, కాలీద్, బుచ్చయ్య, రత్నం, నాగరాజు, అంజయ్య, ప్రవీణ్, రహీం, మల్లేశం, పల్లవి, శివానంద్, బంధయ్య, నర్సిములు, జమీల్, శేఖర్, ఉస్మాన్, మహేందర్, విజయ్ కుమార్, ప్రవీణ్, మణి, తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa