ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 03:39 PM

కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే కార్యకర్త నాయకుల కుటుంబాలను కష్టసుఖాలలో పాలుపంచుకొని గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి  ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్ మండలం అగ్రం పహాడ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏలియా తండ్రి అకాల మరణం విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హుటాహుటిన సంఘటన వద్దకు చేరుకుని మృతిని పార్టీవదేహంపై పూల గుచ్చాలను పెట్టి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ పూజారి గోనెల నరసింహా రాములు 80 అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పూజారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, జాతర చైర్మన్ రమేష్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ముద్ధం సాంబయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం స్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ముద్దం  కృష్ణంరాజు, అల్వాల రవి, వాసవి భద్రారెడ్డి, ధర్మేందర్, ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa