ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే బ్యాడ్న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్- నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కోచ్లను తగ్గించింది. ప్రస్తుతం 20 కోచ్లతో ట్రైన్ నడుస్తుండగా.. ఫిబ్రవరి 19 నుంచి 8 కోచ్లతో నడపాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు వందే భారట్ ట్రైన్లు నడుపుతున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు తెలంగాణ నుంచి నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ట్రైన్ కనెక్టివిటీ పెంచాలని హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, బెంగళూరులతో పాటుగా నాగ్పుర్ నగరానికి ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
తిరుపతి, బెంగళూరులకు చాలా నెలల క్రితమే ట్రైన్లు అందుబాటులోకి రాగా.. సికింద్రాబాద్-నాగపూర్ ట్రైన్ మాత్రం గతేడాది సెప్టెంబర్ 16న ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ను వర్చువల్గా ప్రారంభించారు. అయితే ట్రైన్ ప్రారంభించినపప్పటి నుంచి ఆక్యుపెన్సీ లేదు. మెుత్తం 20 బోగీలతో ఈ ట్రైన్లు నడుస్తుండగా.. సగం సీట్లు కూడా నిండటం లేదు. ట్రైన్లో దాదాపుగా అన్ని కోచ్లు ఖాళీగానే ఉంటున్నాయి. ట్రైన్ ప్రారంభం అయిన నాటి నుంచి రద్దీ ఉండటం లేదు. 2024 సెప్టెంబర్ నుండి 2025 జనవరి వరకు గత ఐదు నెలల్లో నాగ్పూర్-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 20101) వందే భారత్ ఎక్స్ప్రెస్ సగటు ఆక్యుపెన్సీ 33.81 శాతంగా ఉందని.. సికింద్రాబాద్-నాగ్పూర్ (రైలు నంబర్ 20102) వందే భారత్ ఎక్స్ప్రెస్ 33.87 శాతంగా ఉందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ- మహారాష్ట్ర మధ్య వాణిజ్యపరంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ వందే భారత్ ట్రైన్ నడుపుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్లను కనెక్ట్ చేస్తూ ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని భావించారు. అయితే ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సరైన ఆదరణ ఉండటం లేదు. దీంతో కోచ్ల సంఖ్యను తగ్గించారు. 20 కోచ్ల సంఖ్యను ఎనిమిదికి తగ్గించగా.. ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa