తెలంగాణలో ఎక్కడ చూసినా కొత్త రేషన్ కార్డుల గురించే చర్చ నడుస్తోంది. జనవరి 26వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందే ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి.. అర్హుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ జాబితాలను గ్రామసభల్లో ప్రకటించారు కూడా. అయితే.. ఆ జాబితాల్లో లేని చాలా మంది తాము కూడా అర్హులమేనని.. అయినా తమ పేర్లు జాబితాల్లో రాలేదంటూ గగ్గోలు పెట్టటంతో.. వారందరికీ కూడా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. దగ్గరిలోని మీ-సేవా కేంద్రాల్లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించింది. దీంతో.. జనాలంతా మీ-సేవా కేంద్రాలకు క్యూ కట్టారు.
అయితే.. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఎప్పుడైనా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పదే పదే చెప్తొంది. అయితే.. ప్రకటించిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారు..? ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఎప్పుడిస్తారన్న అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో.. కొత్త రేషన్ కార్డుల జారీపై బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే.. ప్రస్తుతం దరఖాస్తున్న చేసుకుంటున్న అప్లికేషన్లను పరిశీలించి.. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అర్హులా కాదా అని నిర్ధారించి.. అప్పుడు జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
అయితే.. ఇప్పటికే ప్రకటించిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు పెద్దగా పని లేకపోయినప్పటికీ.. మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా... వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ రెండు స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఆయా జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో.. ఈ కోడ్ ముగిసేవరకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోనుంది. దీంతో.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ ముగిసిన తర్వాతే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవనుందని తెలుస్తోంది.
అయితే.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని ప్రభుత్వం చెప్తొంది. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. మీ-సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa