ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరామ్ నగర్ లో రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా ప్రజల అవసరాలను గుర్తించి బలమైన రహదారులను నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం అభివృద్ధి పనులను చేపట్టాలని తెలిపారు..అనంతరం స్థానికులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కాలనీలో నాణ్యమైన రహదారులు అందుబాటులోకి రావడానికి కృషి చేసినందుకు ఎమ్మేల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి మన్నే హరినాథ్, ఉపాధ్యక్షులు లింగ బిక్షపతి, చైర్మన్ ఆర్ నరసింహ, కోశాధికారి ఎన్ చంద్రయ్య, సభ్యులు రాములు ఉపేందర్, నరేష్, అజయ్, కుమార్, యాది, రమేష్, ఈశ్వర్, సత్యనారాయణ, మల్లేష్, సత్తిబాబు, మహేష్, క్రాంతి, మరియు స్థానిక నాయకులు కుంట సిద్ధిరాములు, సంపత్ మాధవరెడ్డి, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, పోలే శ్రీకాంత్, విజయ హరీష్, రాములు యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa