అర్హులైన రైతులందరికి రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో అందించాలని నారాయణాఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం అన్నారు.నారాయణాఖేడ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు 3 ఎకరాల లోపు వారికి అందించామని చెప్పిన డబ్బులను 60% మంది రైతులకు కూడా అందించలేదు అన్నారు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలంలో సుమారు 13,000 ఎకరాలకు గాను 8,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వచ్చాయని.మిగిలిన భూమికి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.అదే మండలానికి చెందిన శేరి దామరగిద్ద గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 31లో 525 ఎకరాలకు గాను ఒక ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడంపై మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ సర్వే నంబర్లు అందరూ గిరిజనులు ఉన్నారు. బీద రైతులు ఉన్నారని వారికి తక్షణమే రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు వస్తే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే వాటిని పరిశీలించి వారికి రైతుబంధు డబ్బులు వచ్చే విధంగా చేశాను అని తెలిపారు.
కానీ ఇప్పుడు ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే ని గెలిపించిన ఈ నియోజకవర్గానికి దేనికి పనికి రాకుండా పోయారు అని అన్నారు.నియోజకవర్గంలోని అందరు రైతులకు తక్షణమే రైతు భరోసా కింద వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం ఎలాంటి నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి అయినా రైతుల కోసం అన్ని విధాల కొట్లాడడానికి మేము బిఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa