ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రెండు జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా కస్టర్లు.. భట్టి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 06:23 PM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మెుత్తం రూ.3,04,965 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భట్టి కీలక ప్రకటన చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఔషధాల తయారీ కంపెనీలకు, బయోటెక్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. యాంటీ బయాటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.


2050 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్-2050 పాలసీని ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు.. హైదరాబాద్ ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా, పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను ఐటీ, ఫార్మా, హెల్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత, ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి, పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడతున్నామని చెప్పారు. అంతేకాకుండా, హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ ను NH 163 కి ఇరువైపుల ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి స్పష్టం చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారిందని భట్టి వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్‌లో జరిగిన ఒప్పందాల్లో భాగంగా.. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలలో ఉన్న 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుందన్నారు. గత ఏడాదితో పోల్చితే.. ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ అని చెప్పారు. అమెరికా, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో సీఎం మరో 14,900 కోట్ల రూపాయలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa