రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలో ఓ కారులో నుంచి మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తించి కారులో నుంచి కిందకు దిగిపోయాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని తెలిపారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa